కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train )లో ప్రయాణించారు. రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలామంది ప్రయాణికులు మంత్రితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
నిర్మలా తారామన్ ఘట్కోపర్ నుంచి కల్యాణ్ స్టేషన్ (Ghatkopar – Kalyan) వరకూ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. . ఓ చిన్నారిని కూడా పలకరించారు. రైల్లో కేంద్ర మంత్రిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ట్రైన్ రైడ్ (train ride)కు సంబంధించిన ఫొటోలను నిర్మలమ్మ కార్యాలయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Smt @nsitharaman interacts with commuters while travelling from Ghatkopar to Kalyan in a Mumbai local train. pic.twitter.com/T15BdC3f5V
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) February 24, 2024
ఇటీవలే కాలంలో పలువురు నేతలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కొంతకాలం కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి.. స్థానికులతో ముచ్చటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train )లో ప్రయాణించారు.