లోకల్​ ట్రైన్​ లో కేంద్రమంత్రి ప్రయాణం.. పాసింజర్స్​తో సెల్ఫీలు దిగిన మహిళా మంత్రి

లోకల్​ ట్రైన్​ లో కేంద్రమంత్రి ప్రయాణం.. పాసింజర్స్​తో సెల్ఫీలు దిగిన మహిళా మంత్రి

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ముంబై లోకల్‌ ట్రైన్‌ (Mumbai Local Train )లో ప్రయాణించారు.  రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలామంది ప్రయాణికులు మంత్రితో సెల్ఫీలు దిగారు.  ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో విస్తృతంగా షేర్​ అవుతున్నాయి. 

నిర్మలా తారామన్  ఘట్‌కోపర్ నుంచి కల్యాణ్‌ స్టేషన్‌ (Ghatkopar – Kalyan) వరకూ ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. . ఓ చిన్నారిని కూడా పలకరించారు. రైల్లో కేంద్ర మంత్రిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ ట్రైన్‌ రైడ్‌ (train ride)కు సంబంధించిన ఫొటోలను నిర్మలమ్మ కార్యాలయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవలే కాలంలో పలువురు నేతలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కొంతకాలం కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి.. స్థానికులతో ముచ్చటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ముంబై లోకల్‌ ట్రైన్‌ (Mumbai Local Train )లో ప్రయాణించారు.